ఫిబ్రవరి - 2014 దినోత్సవాలు

ఫిబ్రవరి - 21
¤ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
     » ఈ సందర్భంగా రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ, రాష్ట్ర అధికార 

భాషా సంఘం సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో మాతృభాషా 
దినోత్సవాన్ని నిర్వహించారు.

     » మాతృ భాషాభివృద్ధికి కృషి చేస్తున్న వారికి ఈ సందర్భంగా 

పురస్కారాలను ప్రదానం చేశారు.

విశిష్ట పురస్కార గ్రహీతలు     ఆచార్య పి.ఎస్.సుబ్రహ్మణ్యం (తెలుగుభాషా రంగం), ఆచార్య వకుళాభరణం రామకృష్ణ (చరిత్ర పరిశోధన రంగం), 'ఆంధ్ర భారతి' వెబ్‌సైట్ (నిఘంటు నిర్మాణం), కె.రామచంద్రమూర్తి (ప్రసార రంగం), రహెనుమా-ఏ-దక్కన్ ప్రధాన సంపాదకుడు సయ్యద్ వికారుద్దీన్ (ఉర్దూ భాష).

తెలుగు పరిపాలన భాషా పురస్కార గ్రహీతలు
    ఐఏఎస్ అధికారులు అంగలకుర్తి విద్యాసాగర్, ఎన్.శివశంకర్, వి.దుర్గాదాస్, ఎం.వీరబ్రహ్మయ్య (కరీంనగర్ జిల్లా కలెక్టర్), ఎన్.సురేష్ కుమార్ (గుంటూరు జిల్లా కలెక్టర్), నీతు కుమారి ప్రసాద్ (తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్), ఎన్.గిరిజాశంకర్ (మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్), రాజీవ్‌గాంధీ విశ్వవిద్యాలయం ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీ వైస్ ఛాన్సలర్ ఆచార్య ఆర్.వి.రాజకుమార్, ద్రవిడ విశ్వ విద్యాలయం ఉపాధ్యక్షుడు ఆచార్య కంకణాల రత్నయ్య, జవహర్ జ్ఞానాధారిత అనుసంధాన వ్యవస్థాపక సంఘం ముఖ్య కార్యనిర్వహణాధికారి ఆత్మకూరి అమరనాథ్‌రెడ్డి.