నవంబరు - 2014 దినోత్సవాలు


నవంబరు - 11 
¤ జాతీయ విద్యాదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
      »
 భారత తొలి విద్యాశాఖమంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ 
జయంతిని పురస్కరించుకుని ఏటా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు.

      » ఈ సందర్భంగా దిల్లీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్రపతి
 ప్రణబ్ ముఖర్జీ పాల్గొన్నారు.
నవంబరు - 13
¤ గిన్నిస్ ప్రపంచ రికార్డుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు  
నవంబరు - 19 
¤ 'వరల్డ్ టాయిలెట్ డే'ను నిర్వహించారు.

      » భారత్‌లో బహిరంగ మల విసర్జన చేస్తున్న వారి సంఖ్య ఏకంగా 59.7 కోట్లు 
అని ఐక్యరాజ్య సమితి 'వరల్డ్ టాయిలెట్ డే' సందర్భంగా వెల్లడించింది. 
ఈ విషయంలో భారత్ ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉన్నట్లు ఐరాస వెల్లడించింది.
 భారత జనాభాలో 47 శాతం మంది ఆరు బయటే మల విసర్జన చేస్తున్నారని ఐరాస తెలిపింది. 
నవంబరు - 25
¤ స్త్రీలపై హింసకు వ్యతిరేకంగా అంతర్జాతీయ దినోత్సవాన్ని నిర్వహించారు.

      » 1960 నవంబరు 25న డొమినికన్ రిపబ్లిక్‌లో రాజకీయ కార్యకర్తలైన

 ముగ్గురు అక్కాచెల్లెళ్లను (మిరాబల్ సిస్టర్స్) దారుణంగా హత్య చేశారు. అందుకే
 నవంబరు 25ను 'స్త్రీల పై హింసకు వ్యతిరేకంగా అంతర్జాతీయ దినం'గా 
ఐక్యరాజ్యసమితి ఎంచుకుంది.

      » యూఎన్‌వో 1999 నుంచి ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. ప్రపంచ 

వ్యాప్తంగా మహిళలు ఎదుర్కొంటున్న హింసపై వివిధ కోణాల్లో అధ్యయనాలు నిర్వహిస్తూ, నివేదికలు ప్రచురిస్తోంది. మార్పు కోసం ఏదిశగా కృషి సాగాలో సూచిస్తోంది.
నవంబరు - 26
¤ జాతీయ న్యాయ దినోత్సవాన్ని నిర్వహించారు.

      » భారత ప్రజలందరికీ సామాజిక, రాజకీయ, ఆర్థిక న్యాయ కల్పనే రాజ్యాంగ 
లక్ష్యం. అది సాకారమయ్యేందుకు సిద్ధం చేసిన రాజ్యాంగ తొలి ముసాయిదా ప్రతిపై 
నవంబరు 26న సంతకాలు చేసిన రోజును 'జాతీయ న్యాయ 
దినోత్సవం'గా నిర్వహిస్తున్నారు.

      » చట్టం ముందు అంతా సమానమే అని, ఆ నిబంధనల ఆధారంగా 
సత్వర న్యాయసాధనకు ముందుంటామని ఆ రోజున న్యాయవాదులు ప్రతిజ్ఞ 
చేస్తారు.

¤ 2008 నవంబరు 26న ముంబయి ఉగ్రవాద దాడి ఘటన జరిగి
 ఆరేళ్లు పూర్తయ్యాయి.
      » 26/11 ముంబయి దాడుల మృతులకు ప్రధాని నరేంద్ర 
మోదీ నివాళి అర్పించారు. 18వ సార్క్ సదస్సులో పాల్గొనేందుకు 
ఖాట్మండులో ఉన్న ఆయన ట్విట్టర్‌లో తన సందేశాన్ని పెట్టారు.

      » ఈ దాడులపై ఏర్పాటు చేసిన రామ్ ప్రధాన్ కమిటీ సిఫార్సులను
 అమలు చేస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

      » లష్కరే తోయిబాకు చెందిన పది మంది ఉగ్రవాదులు 
2008లో ముంబయిలోని పలుచోట్ల జరిపిన దాడుల్లో 166 మంది 
మరణించారు.