* బ్రిటీష్ వారి దాడికి ముందు అంటే 17 వ శతాబ్ధపు
ప్రారంభం వరకూ భారతదేశం ప్రపంచంలోని ఎక్కువ ఐశ్వర్యం
గల దేశాలలో ఒకటి.
* అంకెలను కనుగొన్నది భారతదేశం, సున్నా (జీరో) కనుగొన్నది మన శాస్తవ్రేత్త ఆర్యభట్ట.
* భారతదేశం ప్రపంచంలోనే 6వ పెద్ద దేశం, అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం.
* ఎక్కువ మసీదులున్న దేశం భారతదేశం. భారతదేశంలో 3,00,000 మసీదులున్నాయి. ముస్లిం ప్రపంచం మొత్తం మీద ఇన్ని మసీదులు లేవు.
* ప్రపంచం మొత్తం మీద కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఎగుమతిలో ఇండియా నెంబర్ వన్.
* 1986 ముందు వరకు ఒక్క భారతదేశంలో మాత్రమే డైమండ్లు కనబడేవి.
* ప్రపంచంలోనే ఎక్కువ ఉద్యోగస్తులను కలిగి ఉన్నది భారతదేశ రైల్వే.
* ప్రపంచంలోనే అత్యధికమైన పోస్ట్ ఆఫీసులు కలిగినది భారతదేశం. 1,50,000 పోస్ట్ ఆఫీసులు ఉన్నాయి.
* భారతదేశంలో మిలియనీర్లు ఒక మిలియన్ వరకు ఉంటారు. కానీ చాలామంది భారతీయులు కేవలం 2 డాలర్లతోనే రోజు గడుపుతున్నారు. భారతీయ జనాభాలో 35 శాతం దారిద్య్రరేఖకు క్రిందే బ్రతుకుతున్నారు.
* సూపర్ కంప్యూటర్లను తయారుచేసే దేశాలలో ఇండియాది 3వ స్థానం (అమెరికా, జపాన్ మిగిలిన 2 దేశాలు).
* శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపే దేశాలలో భారత్ది 6వ స్థానం.
* 1985 ముందు వరకు ఇండియాలో ప్లాస్టిక్ బ్యాగులు లేవు.
* చక్కెరను మొదట వాడింది మనవాళ్ళే.
0 వ్యాఖ్యలు
Post a Comment
Thank You for your Comment