భారత పార్లమెంట్ సమావేశాల నిర్వహణ ఖర్చు నిమిషానికి ఎంత? మీకు తెలుసా?



పార్లమెంట్ కోసం చిత్ర ఫలితం

పార్లమెంటు సమావేశానికయ్యే వ్యయం 18 రోజులకు రూ. 35 కోట్లు  
నాలుగు రోజులుగా జరుగుతున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాలు నిరసనలు, వాయిదాలతో తుడిచిపెట్టుకుపోయాయి. అధికార, విపక్ష సభ్యులు పోటాపోటీగా ప్లకార్డుల ప్రదర్శన, ఆరోపణలు, ప్రత్యారోపణలతో చర్చ జరగకుండా విలువైన పార్లమెంటు సమయాన్ని వృథా చేస్తున్నారు. దీని వల్ల ప్రజాధనం కూడా వృథా అవుతోంది. 

18 రోజుల పాటు సాగే ఈ పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు ఇలాగే అంతరాయం కలిగితే వృథా అయ్యే ప్రజాధనం ఎంతో తెలుసా...? సుమారు రూ. 35 కోట్లకు పైనే. అంటే సమావేశం జరిగే ప్రతి నిమిషానికి దాదాపు రూ. 29వేలు ఖర్చు చేస్తున్నట్లు లెక్క. సమావేశాలు అర్థవంతంగా జరగపోతే ఆ మేర ప్రజాధనానికి నష్టం వాటిల్లినట్లే. రోజులో లోక్‌సభ సగటున 6 గంటలు, రాజ్యసభ 5 గంటలు పనిచేస్తాయి. 

మొదటి రోజు నుంచే ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ మంత్రులు, ముఖ్యమంత్రులను తొలగించనిదే ఎలాంటి చర్చ జరగనివ్వబోమంటూ ప్రతిపక్ష కాంగ్రెస్‌పార్టీ సమావేశాలు ప్రారంభమైన నాటి నుంచి నిరసనలకు దిగుతోంది. దీని వల్ల సభా కార్యక్రమాలు 6 శాతం మాత్రమే జరిగి, 94 శాతం అంతరాయం కలిగినట్లు ఓ నివేదిక తెలిపింది. 'ప్రపంచ దృష్టి మనపై ఉంది. పార్టీ పంథా, ప్రాంతీయ ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకోవడం అవసరమే అయినా.. సభ్యులు విశాల దృక్పథాన్ని అలవరచుకోవాలి' అని ప్రధాని నరేంద్రమోదీ గురువారం ఓ కార్యక్రమం సందర్భంగా వ్యాఖ్యానించారు. 

0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment