ఎవరెస్టు పర్వతానికి ఆ పేరు ఎలా వచ్చింది?

ఎవరెస్టు కథ చాలా ఆసక్తిగా ఉంటుంది. మొదట్లో నేపాల్‌ దేశస్థులు దీన్ని 'సరగ్‌ మాతా' అని పిలిచేవారు. 1852లో భారత ప్రభుత్వం ఈ పర్వతానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించేందుకు ఒక పర్యవేక్షక బృందాన్ని అక్కడకు పంపింది. 
everest కోసం చిత్ర ఫలితం
ఆ బృందంలో జనరల్‌ సర్‌ జార్జ్‌ ఎవరెస్ట్‌ అనే ఒక సర్వేయరు ఉన్నాడు. ఆ బృందంలోనే రాధానాథ్‌ సికందర్‌ అనే వ్యక్తి ఎంతో కష్టపడి ఈ శిఖరాన్ని గురించి అనేక విషయాలు సేకరించాడు. తనకు లభించిన సమాచారాన్నంతా జార్జ్‌ ఎవరెస్టుకు పంపుతుండేవాడు సికందర్‌. 

తర్వాత కొన్ని సంవత్సరాలకు ఈ శిఖరానికి పేరు పెట్టడం గురించి చర్చకు వచ్చినప్పుడు మాత్రం జార్జ్‌ ఎవరెస్ట్‌ పేరు ప్రతిపాదనకు వచ్చింది. అలా శ్రమ, కష్టం ఒకరిదైతే, పేరు మాత్రం జార్జ్‌ ఎవరెస్ట్‌కు దక్కింది.

0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment