జాకోబస్ హెన్రికస్ వాంట్హాఫ్ జూనియర్ 1852 ఆగస్టు 30న నెదర్లాండ్స్లోని రోటర్డామ్లో జన్మించారు. తల్లిదండ్రులు హెన్రికస్ వాంట్హాఫ్ సీనియర్, కాఫ్వాంట్ హాఫ్. * చదువు ప్రారంభించిన తొలినాళ్లలో కవిత్వం, వేదాంతం పట్ల ఆసక్తి ప్రదర్శించేవాడు. 1869లో డెప్ట్ విశ్వవిద్యాలయంలో చేరాడు. రసాయన సాంకేతిక నిపుణుడిగా పట్టా పొందాడు. 1874లో యుట్రెక్ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పట్టా పొందాడు. * 1874లో వాంట్హాఫ్ స్టియిరో కెమిస్ట్రీలో చేసిన పరిశోధనలను ప్రచురించాడు. * 1884లో రసాయన గతిశాస్త్రంపై చేసిన పరిశోధనా వివరాలను ప్రచురించాడు. వీటిలో రసాయన చర్యల క్రమాంకాన్ని (order) నిర్ణయించడానికి కొత్త పద్ధతి కనిపెట్టాడు. ఈ పద్ధతిలో గ్రాఫిక్స్, ఉష్ణగతి శాస్త్ర నియమాలను రసాయన చర్యల సమతాస్థితికి ఉపయోగించాడు.
|
|
* 1889లో అర్హీనియస్ సమీకరణానికి భౌతిక న్యాయాన్ని సమకూర్చాడు. 1896లో
వాంట్హాఫ్ను బెర్లిన్లోని ప్రష్యన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్లో రసాయన శాస్త్ర ఆచార్యుడిగా నియమించారు
.* వాంట్హాఫ్ 1893లో రాయల్ సొసైటీ నుంచి డేవి పతకాన్ని స్వీకరించాడు.
* ద్రావణాల మీద చేసిన ప్రయోగాలు, పరిశోధనలకు 1901లో రసాయన శాస్త్రంలో
నోబెల్ బహుమతి పొందాడు.
* జర్మనీలోని బెర్లిన్లో 58వ ఏట 1911 మార్చి 1న మరణించారు.
|