విలియం గేస్కోయిన్



        విలియం గేస్కోయిన్ 1612లో లీడ్స్‌లోని మిడిల్‌టన్‌లో జన్మించారు. మార్గరెట్ జేన్, హెన్రీ గేస్కోయిన్ ఆయన తల్లిదండ్రులు. గేస్కోయిన్ విద్యాభ్యాసం ప్రఖ్యాత ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో సాగింది.  
శాస్త్ర జీవితం:        విలియం గేస్కోయిన్ తొలిసారి మైక్రోమెట్రిక్ మర తయారుచేశారు. దాన్ని ఓ సెక్సటాంట్‌కి అమర్చి.. రెండు ఖగోళ వస్తువుల మధ్య దూరాన్ని కచ్చితంగా కొలవగలిగారు. మర భ్రమణాంతరం, కటకం నాభ్యాంతరాల సహాయంతో చంద్రుడు, ఇతర గ్రహాల పరిమాణం నిక్కచ్చిగా లెక్కగట్టారు.గేస్కోయిన్ రూపొందించిన మైక్రోమీటర్ ఆ తర్వాత మరింత మెరుగైంది. అలా మెరుగుపరిచిన మైక్రోమీటరు మరతో శాస్త్రవేత్త రాబర్ట్ హుక్ తోకచుక్క, ఇతర ఖగోళ వస్తువుల పరిమాణాలు కనుక్కున్నారు. జేన్ లారెంట్ పామర్ ఆ మైక్రోమీటరు మరను మరింతగా అభివృద్ధి చేసి, ఇప్పుడు మనం ఉపయోగిస్తున్న స్క్రూగేజ్‌ని తయారుచేశారు. దీని సహాయంతోనే చిన్నవస్తువుల పరిమాణాలు లెక్కగట్టగలిగారు.       గేస్కోయిన్ 1642లో కింగ్ ఛార్లెస్ - 1 సైన్యంలో చేరారు. 1644 జులై 2న యార్క్‌షైర్ మార్‌స్టన్ మూర్‌లో జరిగిన యుద్ధంలో మరణించారు.